విద్య‌కు పెద్ద‌పీఠ వేసిన కూట‌మిప్ర‌భుత్వం

  • నెల్లూరులోని బ‌లిజ(కాపు) భ‌వ‌న్‌లో విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అందిజేసిన మంత్రి నారాయ‌ణ‌
  • 104 మంది విద్యార్థుల‌కు డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో రూ.4.80 ల‌క్ష‌లు అంద‌జేత‌
  • త్వ‌ర‌లో బ‌లిజ (కాపు) భ‌వ‌నాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతామ‌న్న మంత్రి నారాయ‌ణ‌

పేద విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌కు టీడీపీ ప్ర‌భుత్వం పెద్ద‌పీఠ వేస్తుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరులోని బ‌లిజ భ‌వ‌న్‌లో డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో బ‌లిజ మెరిట్ విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అంద‌జేసే కార్య‌క్ర‌మంలో మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వ‌ళ‌న చేసి సభను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణను బ‌లిజ సంఘం నేత‌లు గజమాల, శలవాలతో ఘ‌నంగా స‌త్క‌రించారు. అక్క‌డికి విచ్చేసిన విద్యార్థుల‌తో మంత్రి నారాయ‌ణ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంత‌రం 104 మంది బ‌లిజ విద్యార్థుల‌కు న‌గ‌దు పుర‌స్కారాల‌ను అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల జీఎం వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, మాజీ జ‌డ్పీటీసీ విజేత‌రెడ్డి, టీడీపీ శ్రేణులు, బ‌లిజ నేత‌లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *