తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్…

  • మీడియా స‌మావేశంలో వాకాడు సీఐ హుస్సేన్ బాషా

వాకాడు మండ‌లం దుగ‌రాజప‌ట్నం గ్రామ పంచాయ‌తీలోని శ్రీ‌నివాసపురం గ్రామంలో మ‌ద్యం మ‌త్తులో క‌న్న‌తండ్రినే కుమారుడు క‌ర్ర‌తో దాడి చేసి చంపేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై వాకాడు పోలీసుస్టేష‌న్లో కేసు న‌మోదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టి…ముద్దాయి ర‌మేష్‌ను శ్రీ‌నివాసపురంలో అరెస్ట్ చేసిన‌ట్లు సీఐ హుస్సేన్‌బాషా తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న స‌ర్కిల్ పోలీసు కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి కేసుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని…రిమాండ్‌కు త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో సీఐతోపాటు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ నాగ‌రాజు, కానిస్టేబుళ్లు సురేష్‌, షేక్ మ‌స్తాన్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *