- దర్గా వద్ద భక్తులకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు
- ఏఎస్పేటలో ఎస్ఐ తనిఖీలు
నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని దర్గా ప్రాంతంలో ఎస్ఐ ఏ సైదులు తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. దర్గాకి విచ్చేసే భక్తులు, యాత్రికులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో బీట్ పోలీసు సిబ్బంది విధులను ఎస్ఐ స్వయంగా పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. దుకాణదారులందరూ త్వరగా మూసి వేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పనితీరు పట్ల గ్రామస్తులు భక్తులు అభినందనలు తెలియజేశారు.