- కడివేడు గ్రామంలో హత్యకేసును చేధించిన పోలీసులు
- నింధితులను రిమాండ్కు తరలించిన గూడూరు డీఎస్పీ రమణకుమార్
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో దీపావళి రోజు జరిగిన హత్య కేసు విషయంలో ముగ్గురు నింధితులను అరెస్ట్ చేసినట్లు మై డీఎస్పీ రమణ కుమార్ తెలియజేశారు. చిల్లకూరు పోలీస్స్టేషన్లో మృతుడు ఎర్రిపాక వెంకటేష్ హత్యకు సంబంధించిన నింధితులను మీడియా ముందు ప్రవేశపెట్టి విలేకరులతో డిఎస్పీ వివరాలు వెల్లడించారు. కడివేడు గ్రామంలో జరిగిన హత్యకు సంబంధించి ముగ్గురు నింధితులను అరెస్ట్ చేశామన్నారు. పాత గొడవల కారణంగా పగబెట్టుకొని మరి దారుణంగా దాడి చేసి హతమార్చినట్లు తెలిపారు. ఈ కేసు సీరియస్గా తీసుకుని చాకచక్యంగా విచారణ చేపట్టి ముద్దాయిలను కోట క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. ముగ్గురు నింధితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమణకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కిషోర్ బాబు, చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.