- మాజీ మంత్రి కాకాణి
- బండి చెంచయ్య కుటుంబానికి రూ. లక్ష చెక్కు అందచేసిన ఎంపీ, మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం వడ్డిపాళెం గ్రామానికి చెందిన బండి చెంచయ్య కుంటుబానికి లక్ష రూపాయలను చెక్ ను ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యలతో కలిసి వైసీపీ నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతుల మీదగా అందజేశారు. లక్ష రూపాయలు దాతృత్వాన్ని అందించిన పెళ్లకూరు మండలం సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కాకాణి అభినందించారు. చెంచయ్య మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయమని హైకోర్టు ఆదేశించినా పోలీసు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, కార్యకర్తకు అండగా ఉంటూ పోరాడుతామని కాకాణి తెలిపారు