- సంగం ప్రధాన రహదారికి మోక్షం
- మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ నాయకులు, ప్రజలు
నెల్లూరు జిల్లా సంగంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ప్రధానమైన సమస్య తీరింది. చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో కార్యక్రమానికి సంగం మీదుగా వెళ్తున్న మంత్రి ఆనంని స్థానిక టీడీపీ నాయకులు ఆపి రహదారిపై మురుగు నీటి సమస్య గురించి వివరించి ఆ దృశ్యాలను చూపించారు. వెంటనే స్పందించిన మంత్రి ….. ఆర్ &బి అధికారులతో ఫోన్లో మాట్లాడి రహదారిపై మురుగునీటి ఇబ్బందులను తొలగించాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశించిన గంటలోనే ఆర్&బి అధికారులు రహదారిపై మురుగునీటిని తొలగించి జెసిబితో మరమ్మత్తులు చేశారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుని వెంటనే సిసి రోడ్డు, డ్రైనేజీ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. రహదారిపై మురుగునీటి తొలగింపుపై టీడీపీ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.