- నాగమాంబాపురం వాటర్ ప్లాంటును త్వరలో ఉపయోగంలోకి తీసుకొస్తాం
- బుచ్చి ఎంపీడీవో శ్రీహరి
గ్రామాలలో రోడ్లపై ఎరువు దిబ్బలు వేయడంపై నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీవో శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన నాగమాంబాపురం పంచాయతీలో పర్యటించారు.. సచివాలయం పక్కనే ఎరువు దిబ్బలను చూసి మండిపడ్డారు.. రెండు మూడు రోజుల్లో పేడ దిబ్బలను ఎత్తివేలని సూచించారు.. గ్రామాలలో స్వచ్ఛతపై దృష్టి సారించాలన్నారు.. ఈ సందర్భంగా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు.. త్వరలో ఉపయోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు.. ఆయన వెంట మాజీ సర్పంచులు.. పెంచలయ్య, రాఘవరెడ్డి..వీఆర్వోలు, ఇంజనీరింగ్, వెటర్నరీ, వెల్పేర్, అగ్రికల్చరల్ అసిస్టెంటులు, సర్వేయర్, మహిళా పోలీస్ టీడీపీ నేత కిష్టయ్య ఉన్నారు.