- నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎస్ మహమ్మద్ ఆజాద్
- రాపూరులో ఉల్లాస్ కార్యక్రమం
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల వెలుగు కార్యాలయంలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్, అడల్ట్ ఎడ్యుకేషన్ కన్వీనర్ యస్.మహమ్మద్ ఆజాద్, మండల ఎంపీడీవో భవాని, ఏపీఎం రాధారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మహమ్మద్ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ…. నిరక్ష్యరాశుల్ని అక్షరాశ్యుల్ని చేయడమే ఉల్లాస్ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల వెలుగు కార్యాలయం ఈవోఏలు , సీసీలు, వాలంటీర్ టీచర్లు పాల్గొన్నారు.