చేజ‌ర్ల‌లో మిషన్ పాట్ హోల్ ఫ్రీ…

  • గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌భుత్వ ల‌క్ష్యం
  • మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి

గత ప్రభుత్వం విస్మరించిన అన్ని రహదారులను మరమ్మతులు చేపట్టి ఏ ఒక్క రోడ్డుపై కూడా గుంటలు లేకుండా ప్రజలందరూ సాఫీగా ప్రయాణం చేయడమే గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్య‌క్ర‌మ‌మ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్య‌క్ర‌మాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

గుంత‌లమయమైన రోడ్డుపై కంకర చిప్స్ వేసి గుంతలను పూడ్చే పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వం ఐదేళ్లలో ధ్వంసం చేసిన రోడ్లను మనకు ఆస్తిగా ఇచ్చి వెళ్ళిందని, అటువంటి రోడ్లను బాగు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం శుభపరిణామంగా మంత్రి చెప్పారు.

గ్రామాల్లోని సర్పంచులు కూడా తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ గంగాధర్, ఆత్మకూరు ఆర్డీవో పావని, స్థానిక ప్రజా ప్రతినిధులు బొల్లినేని గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *