- పులగం శంకర్ రెడ్డి, రఘునాథ్రెడ్డి ఆధ్వర్యంలో గౌతమ్రెడ్డికి నివాళులు
- పీహెచ్సీలో పేషెంట్లకు బ్రెడ్లు పంపిణీ
నెల్లూరు జిల్లా సంగంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంగం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పి హెచ్ సి లో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. గౌతంరెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణమ్మ ,జడ్పిటిసి రావుల లక్ష్మి, వైసిపి నాయకులు తుంగా ఇందూధర్ రెడ్డి,వైసిపి యువజన విభాగం మండల అధ్యక్షులు ఊటుకూరు జనార్దన్ రెడ్డి ,మధుసూదన్ రెడ్డి కరీముల్లా, మల్లికార్జున రెడ్డి, చంద్రారెడ్డి,సర్పంచ్ చందన్ కుమార్, ఫణిందర్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, నరేష్, రామారావు, రవీంద్రబాబు, రాంబాబు ,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.