ప్ర‌శాంత‌మ్మ చొర‌వ‌… తుమ్మ‌గుంట అయ్య‌ప్ప‌స్వామి ఆల‌యానికి పూర్వ‌వైభ‌వం

  • అయ్య‌ప్ప ఆల‌యం దుస్థితిపై N3 స్పెష‌ల్ స్టోరీ
  • వెంట‌నే స్పందించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
  • ఆల‌యాన్ని ప‌రిశీలించి.. నిర్వాహ‌కులు, స‌భ్యుల‌పై తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం
  • పూర్వ వైభ‌వం తెచ్చేలా చ‌ర్య‌లు
  • వీపీఆర్ ఫౌండేష‌న్ ద్వారా త‌క్ష‌ణ సాయంగా రూ.2 ల‌క్ష‌లు మంజూరు
  • త్వ‌ర‌లోనే కొత్త క‌మిటీ ఏర్పాటు చేసేలా నిర్ణ‌యం
  • N3 న్యూస్‌కి అభినంద‌న‌లు, ఎమ్మెల్యేకి ధ‌న్య‌వాదాలు తెలిపిన భ‌క్తులు, ప్ర‌జ‌లు

కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌లంలోని తుమ్మ‌గుంట గ్రామంలో భ‌క్తుల కొంగుబంగార‌మై.. విరాజిల్లుతున్న శ్రీ గురునాథ‌స్వామి అయ్య‌ప్ప స్వామి ఆల‌యం పాల‌కుల నిర్ల‌క్ష్యం.. ప‌ర్య‌వేక్ష‌ణ‌లేని కార‌ణంగా ఆల‌యం ఆల‌నాపాల‌న‌తోపాటు.. ప‌రిశ‌రాలు అప‌రిశుభ్రంగా.. స‌రైన వ‌స‌తులు లేకుండా.. భ‌క్తుల‌కు అసౌక‌ర్యంగా.. ఇబ్బందిక‌రంగా ఉన్న వైనంపై సోమ‌వారం.. అయ్య‌ప్పా.. ఇదేంద‌య్యా.. ప్ర‌శాంత‌మ్మా.. మీరైనా ఇటు చూడండ‌మ్మా.. అనే ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ఎన్‌-3 ద్వారా వెలుగులోకి తేవ‌డం తెలిసిందే. ఎంతో విశిష్ట‌త‌.. ప్రాచీనం.. ప్రాధాన్య‌త క‌లిగి ఉండ‌టంతోపాటు అక్క‌డి అయ్య‌ప్ప‌స్వామి మ‌హిమ‌లుక‌లిగి.. కోరిన కోరిక‌లు నెర‌వేరుస్తార‌న్న న‌మ్మ‌కం భ‌క్తుల్లో ఉంది.

అందుకే శ‌బ‌రిమ‌లై త‌ర్వాత ఇక్క‌డ కొలువై ఉన్న అయ్య‌ప్ప స్వామి దేవాల‌యంకు అంత‌టి ప్రాధాన్య‌త ఉంది. వేలాది మంది భ‌క్తులు ఇక్క‌డ అయ్య‌ప్ప మాల‌న ధ‌రిస్తుంటారు. కార్తీక మాసాంతం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. అటువంటి ఆల‌యం అధ్వాన్న స్థితికి చేరుకున్న స్థితిని ఎన్‌-3 ప్ర‌సారం చేసింది. అంతే కాకుండా.. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అయినా.. స్పందించి.. ఆ ఆల‌యాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్‌-3 ఛాన‌ల్‌లో ప్ర‌సారమైన క‌థ‌నంలో విన్న‌వించ‌డంతో.. సాక్షాత్తు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు.

దుస్థితిలో ఉన్న అయ్య‌ప్ప స్వామి ఆల‌యానికి పూర్వ‌పు ప‌రిస్థితి తీసుకొచ్చేందుకు.. నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే వీపీఆర్ ట్ర‌స్ట్ ద్వ‌రా ఓ టీమ్‌ను ఏర్పాటుచేసి.. ప‌రిశీలించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అక్క‌డ పెరిగి ఉన్న పిచ్చి మొక్క‌ల‌ను తొల‌గించారు. ప్రాంగ‌ణాన్ని ప‌రిశుభ్రంగా త‌యారు చేశారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి శుక్ర‌వారం ఆ గ్రామానికి పింఛ‌న్లు అందించేందుకు వెళ్లారు. ఈసంద‌ర్భంగా ఆమె అయ్య‌ప్ప ఆల‌యానికి వెళ్లారు. ముందుగా అక్క‌డి స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం ఆయ‌ల పూజారుల‌తో మాట్లాడారు. క‌మిటీ స‌భ్యుల‌తో చ‌ర్చించారు. ఆల‌యాన్ని నిర్ల‌క్ష్యంగా వ‌దిలేసినందుకు ఆమె వారంద‌రిపై సీరియ‌స్ అయ్యారు. గుడి ఆస్తులు, క‌మిటీ స‌భ్యులెవ‌రెవరు..? ఛైర్మ‌న్ ఎవ‌ర‌నే విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆల‌యం ను అన్ని విధాలా అభివృద్ధి చేయాల‌ని.. ప్రాంగ‌ణం అంతా కొత్త హంగుల‌తో ఏర్పాటు చేయాల‌ని.. అందుకు ఎంత నిధులు అవ‌స‌ర‌మైన తాను చేస్తాన‌ని.. వారికి హామీ ఇచ్చారు. అలాగే త‌క్ష‌ణం మ‌రుగుదొడ్ల ఆధునీక‌ర‌ణ‌కు త‌క్ష‌ణం 2ల‌క్ష‌ల రూపాయిల‌ను వీపీఆర్ ఫౌండేష‌న్ ద్వారా ఇస్తున్న‌ట్లు అక్క‌డిక‌క్క‌డే ప్ర‌క‌టించారు. అలాగే.. ఆల‌యానికి త్వ‌ర‌లోనే కొత్త క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

అనంత‌రం ప్ర‌శాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్‌-3 చొర‌వ‌తో ఆల‌యంకు పూర్వ‌వైభ‌వం రానుంద‌ని.. అందుకు గ్రామ‌స్తులు, అయ్య‌ప్ప భ‌క్తులు ఎన్‌-3 యాజ‌మాన్యానికి, బృందానికి కృత‌జ్ణ‌త‌లు తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *