16 ఏళ్లుగా మంచి కార్య‌క్ర‌మం…

  • భ‌క్తుల‌పై శివుని ఆశీస్సులు ఉండాలి
  • డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్‌యాద‌వ్‌
  • మూలాపేట శివాల‌యంలో శివ‌మాల భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ పంపిణీ

కార్తీక మాసం సంద‌ర్భంగా గ‌త 16 ఏళ్లుగా మూలాపేట శివాల‌యంలో శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ చేయ‌డం మంచి దైవ కార్య‌క్ర‌మ‌మ‌ని..డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ అన్నారు. న‌గ‌రంలోని మూలాపేట శివాల‌యంలో….ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో శివ‌మాల భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా రూప్‌కుమార్ యాద‌వ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా రూప్ కుమార్ యాద‌వ్ చేతుల మీదుగా శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌దానం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇంత మంచి కార్య‌క్ర‌మం చేస్తోన్న గిరిన్న‌పై, భ‌క్తుల‌పై శివుని ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం ఆల‌య మాజీ చైర్మ‌న్‌, ఆల‌య అర్చ‌కులు ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో శివాల‌యం చైర్మ‌న్‌, ఈవో, ఆల‌య అర్చ‌కులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *