- డిప్యూటీ సీఎంపై కాకాణి హాట్ కామెంట్స్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనకి ప్రాణహాని ఉందని…పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడ బిడ్డ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం పవన్ కి గుర్తు లేదా..? అని సూటిగా ప్రశ్నించారు. 77 మంది మహిళలు అఘాయిత్యలకు గురైతే.. వాటి గురించి పవన్ కనీసం మాట్లాడలేదని…. అలాంటి వ్యక్తి షర్మిలకి భద్రత కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇసుక, మద్యం మాఫియాలకు కూటమి ఎమ్మెల్యేలే పాల్పడుతున్నారని…. నీకు దమ్ముంటే వారిని తొక్కి పెట్టినార తియ్యి అని పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు.