గుంతలు లేని రోడ్లే ప్రభుత్వ లక్ష్యం..

  • కావలి- బుడంగుంట ఆర్ అండ్ బి రోడ్డులో గుంతలకు మరమ్మతులు
  • పనులు ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెడ్డి తెలిపారు. కావలి పట్టణం 17వ వార్డులో బుడంగుంట ఆర్ అండ్ బి రోడ్డులో గుంతల మరమ్మతులకు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేకు టీడీపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పనులకు సంబంధించిన పూజాకార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *