అర్హులైన వారికి ఉచిత సిలిండర్లు అందజేత
మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు
నెల్లూరులో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన నారాయణ
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా సుపరిపాలన సాగిస్తున్నారని…రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 9వ డివిజన్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని మంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. దీపం 2.0 పథకానికి అర్హులైన వారందరికీ ఉచితంగా సిలిండర్లను పంపిణీ చేశారు. గ్యాస్ బండిని జెండా ఊపి ప్రారంభించారు.
లబ్ధిపొందిన వారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలను నెల్లూరు ప్రజల తరపున తెలియజేస్తున్నామన్నారు. దీపం 2.0 ద్వారా నెల్లూరు జిల్లాలో 4,06,552 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.
కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, ఆర్డీవో అనుష, డీఎస్వో వెంకటరమణ, సివిల్సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ అనురాధ, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేతరెడ్డి, నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.