ప్ర‌మాద‌క‌రంగా హోర్డింగ్‌లు…

భ‌యాందోళ‌న‌లో విద్యార్థులు, ప్ర‌యాణికులు

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కేంద్రంలో వివిధ ప్రైవేటు హాస్పిటల్ కు సంబంధించిన ప్రచార హోర్డింగులు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. వెంకటగిరి – గూడూరు రోడ్డు మార్గ మధ్యలో బాలాయపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భాగంలో, బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణం ముందు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌ల కార‌ణంగా విద్యార్థులు ,ప్రయాణికులకు అటువైపు వచ్చు వాహనాలు కనబడక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. పంచాయ‌తీ అధికారుల అనుమ‌తి తీసుకోకుండా ప్ర‌మాద‌క‌రమైన హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌డం స‌రికాద‌ని మండిప‌డ్డారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, అధికారులను వివరణ కోరగా ఎవరు హోర్డింగులు ఏర్పాటు కోసం అనుమతులు తీసుకోలేదని తెలిపారు. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న హోర్డింగ్‌లు తొల‌గించాల‌ని మండ‌ల ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *