అందరిని ఆకర్షించేలా సెట్టింగ్లు
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాల్టీలోని దర్గా వీధిలో భారీ గణనాధుని వ్యాపారస్తులు ఏర్పాటు వేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 23 అడుగుల ఎత్తు, మూడు టన్నుల బరవు కలిగి వినాయక ప్రతిమకి అందరిని ఆకర్షించేలా ఎస్.జే రాజేష్ కమిటీ సభ్యులు చవితి వేడుకలకు సర్వం సిద్దం చేస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం పదిగంటల నుంచి భక్తుల స్వామి వారి దర్శించుకోవాలని నిర్వాహుకులు భక్తులను విజ్ఞప్తి చేశారు. తొమ్మిది రోజులు పాటు పట్టణంలో గణపతి విశిష్ట పూజలు అందుకుంటారని కమిటీ సభ్యులు రాజేష్ వివరించారు.