ఆ..ఘ‌న‌త కాకాణిదే…

మాద‌రాజు గూడూరులో సోమిరెడ్డి హౌసింగ్ విజిట్‌

కోట్ల రూపాయల విలువైన స్థలాలను నిర్వాసిత గ్రామాలకు ఇస్తే… వాటి పనులను ఆపించిన ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డి అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ, మాదరాజు గూడూరు సమీపంలో నిర్మిస్తున్న నేలటూరు నిర్వాసిత గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. సోమిరెడ్డితో పాటు నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ప్రాంతాన్ని పరిశీలించారు. సందర్భంగా నిర్మిస్తున్న ఇంటి పనులను, అలాగే ఇప్పటికే పూర్తయిన ఇళ్లను వారు పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మిపురం సమీపంలోని మరో నిర్వాసిత గ్రామాన్ని సోమిరెడ్డి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, నాయకులు, ఈదురు రామ్మోహన్ రెడ్డి బాబిరెడ్డి, కొత్తపల్లి రమేష్ శర్మ, విష్ణువర్ధన్ రావు, కుంచాలా విజయ్ ,మస్తానయ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *