దాతృత్వం చాటుకున్న కోటంరెడ్డి దంప‌తులు

  • వరద బాధితుల సహాయార్దం సీఎం చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేత‌
  • విజయవాడ కలెక్టరేట్‌లో ఎన్‌బీకే సేవాస‌మితి నుంచి కోటంరెడ్డి రూ.5 ల‌క్ష‌లు, కోటంరెడ్డి సంధ్యా మరో ఐదు లక్షలు
  • ఆపదలో ఉండే ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కోటంరెడ్డి దంప‌తుల‌కు సీఎం ప్ర‌సంశా

రాష్ట ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించే సీఎం చంద్రబాబు నాయుడు.. వరద బాధితులకు అండగా ఉండేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి, ఎన్ బీ కే సేవా సమితి కన్వీనర్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విజయవాడలోని కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి.. కోటంరెడ్డి, ఆయన సతీమణి సంధ్యారెడ్డి.. పది లక్షల రూపాయ‌ల‌ చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు కోటంరెడ్డి దంప‌తుల‌ను అభినందించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆప‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న సీఎం చంద్ర‌బాబు ప‌నితీరు ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. వైసీపీ నేతలు చేస్తున్న బురద రాజకీయాన్ని విజయవాడ ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. వెళ్లిన ప్రతిచోటా ప్రజల నుంచి వారికి నిరసనలు ఎదురవుతున్నాయని కోటంరెడ్డి మండిపడ్డారు.. బాలయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని.. ఇప్పుడు పదిలక్షల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయార్దం అందించామన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *