ఓజిలిలో ఘనంగా టీచర్స్ డే
తిరుపతి జిల్లా ఓజిలి మండలం విద్యాశాఖ కార్యాలయంలో టీచర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా ఎంఈఓ శైలజా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టి.నారాయణ, పీ.శంకరయ్య, ఎస్. శంకరయ్యలను ఎంపీడీవో రజనీకాంత్, ఎమ్మార్వో పద్మావతిలతో కలిసి సత్కరించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపోవడం తమ వృత్తి గర్వకారణమని ఎంఈవో శైలజ అన్నారు. సమాజ హితానికి, బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో
ఉపాధ్యాయుల పాత్ర అసామాన్యమైనదని ఎంపీడీవో,ఎమ్మార్వోలు కొనియాడారు.