ఉచిత ఇసుక పాల‌సీపై కాకాణి హాట్ కామెంట్స్

  • ఉచిత ఇసుక అంతా మోస‌మే
  • ఇసుక అక్ర‌మార్కుల‌కి స‌హ‌హ‌క‌రిస్తున్న జిల్లా యంత్రాంగం
  • ప‌క్ష‌పాతి వైఖ‌రి అవ‌లంభిస్తోన్న ఎస్పీ

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో… మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబునాయుడు, ఉచిత ఇసుక విధానంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉచిత ఇసుక ఇస్తాం అన్న ప్రభుత్వం… గతంలో కంటే ఎక్కువ రేటు కు ఇసుక అమ్ముతుందని ఆరోపించారు. అలాగే ట్రాన్స్ పోర్టు ఖర్చుల పేరుతో ప్రభుత్వం ఇసుకను మూడు నాలుగు రెట్లు అధిక రేటుకు అమ్ముతున్నారని మండిప‌డ్డారు. టిడిపి నేతలు సిఫార్సు వుంటేనే ఇసుక దొరుకుతుందని… లేకుంటే ఇసుక దొరికే ప్రసక్తే ఉండదన్నారు. ఉచిత ఇసుక విధానంలో సరైన చర్యలు తీసుకుని… సరసమైన ధరలకు ప్రజలకు అందేలా చూడాలి లేదంటే ప్రజల తరఫున పోరాటాలు చేస్తామ‌ని కాకాణి హెచ్చ‌రించారు. జిల్లా యంత్రాంగమంతా ఇసుక అక్రమార్కులకు సహకరిస్తుందని.. జిల్లా ఎస్పీ పక్షపాత వైఖరి అవలంభించ‌డం స‌రికాద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *