రంగనాథస్వామి ఆలయం నుంచి వైకుంఠపురం కాశినాయన ఆశ్రమం వరకు
వేడుకగా కలిశ బిందెల గ్రామోత్సవం
లోక కళ్యాణం కాంక్షిస్తూ.. ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని వైకుంఠపురంలోని కాశినాయన ఆశ్రమం పూజ్య గురుదేవులు రామచంద్రనాయన వారి ఆశిస్సులతో పవిత్ర పెన్నా తీర్థంతో కలిశ బిందెల గ్రామోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా.. నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం నుంచి మంగళవాయిధ్యాలతో.. బయలుదేరి.. వైకుంఠపురం కాశినాయన ఆశ్రమం వరకు వేడుకగా తరలి వచ్చారు. ముందుగా రంనాథ స్వామి ఆలయం వద్ద అర్చక పురోహిత జ్యోతిష్యులు శ్రీమాన్ సంతోష్ శర్మ స్వామిచే కలిశ తీర్థం, జలహారతి కార్యక్రమాన్ని పెన్నానది వద్ద జరిగింది. అనంతరం గ్రామోత్సవం జరిగింది. పెన్నానది నుంచి.. ఆశ్రమం వరకు మహిళా భక్తులు, తదితరులు జై దుర్గా.. జైజై దుర్గా.. నినాదాలతో మార్పోగింది. ఆశ్రమం నందు శ్రీ కనకదుర్గ సమేత మల్లిఖార్జున స్వామి వార్లకు.. కాశినాయనకు కలిశ తీర్థాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ధన్వి శ్రీనివాస్, మహంకాళి వెంకటేష్, మహేష్, కుడుముల వెంకటేష్, చెన్నకృష్ణ, సిద్ధూ, లక్ష్మణ్, నాగూర్,నారాయణ, అంకయ్య, గణేష్, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.