- ప్యాలెస్ రోడ్డులో క్షుద్ర పూజలు
-ఆందోళన చెందుతున్న స్థానికులు
కుప్పం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. పట్టణంలోని ప్యాలెస్ రోడ్లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా.. రోడ్డు డివైడర్ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారంటూ.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ముగ్గేసి అందులో ఎర్రటి గుడ్డ, పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ముగ్గు చుట్టూ రక్తపు మరకలు ఉండడంతో జంతుబలి ఇచ్చి ఉంటారని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కుప్పం పట్టణంలో.. ఎప్పుడూ జన సంచారం ఉండే ఈ నడిరోడ్డుపై ఎవరూ చూడకుండా.. క్షుద్ర పూజలు ఎలా చేసి ఉంటారు..? ఎవరు చేసి ఉంటారు..? ఎందుకోసం చేశారు..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.