ఆ పాఠశాల ఆవరణంలో పారిశుద్యం తాండవిస్తుంది..!
_పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఆ మండలం దర్శనమిస్తుంది ఆ మండల పాఠశాలల పరిస్థితి
అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థుల ఇబ్బందులు తెలియాలంటే
N3 ప్రత్యేక కథనం చూడాల్సిందే
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఆ మండలం దర్శనమిస్తుంది ఆ మండల పాఠశాలల పరిస్థితి
అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థుల ఇబ్బందులు తెలియాలంటే..
N3 ప్రత్యేక కథనం చూడాల్సిందే.
దుత్తలూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు అక్కడ పారిశుద్యం దర్శనమిస్తుంది. పాఠశాల బయట డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై, భయంకర దుర్వాసన వెదజల్లుతుందని పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తెలియచేసారు.పాఠశాలలో సుమారు 62మంది విద్యార్థులు, ముగ్గురు ఊపాధ్యాయులు ఉన్నారు.
ఈ పాఠశాల బయట పరిశుధ్య లోపంతో అపరిశుభ్రంగా మారింది. పాఠశాలకు వెళ్లాలంటే మురికి నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ మురికి కాలువ ద్వారా దోమలు విస్తరించి ఎక్కడ తమ పిల్లలు అనారోగ్య బారిన పడతారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు తెలియపరిచిన, స్థానిక ఎంపీడీవో కి,ఈ పాఠశాల దుస్థితిని వివరించిన, గ్రామ సభలో కూడా ఈ పాఠశాల పరిస్థితిని విన్నవించిన ఎటువంటి స్పందన లేదని తల్లిదండ్రులు తెలియజేసేరు. ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదనీ వారు వాపోతున్నారు..పంచాయతీ అధికారులు కనీసం కాలవలు శుభ్రం చేసే దాఖలాలు లేకపోవడంతో కాలవలో చెత్తచెదారం అడ్డుపడి నీరు ప్రవహించుకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని, విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారుల స్పందించి డ్రైనేజీ నీరును శుభ్రం చేయాలని వారు వేడుకుంటున్నారు.