మినిస్ట‌ర్‌ చెప్పినా…డోంట్ కేర్‌అధికారుల తీరుపై త‌మ్ముళ్లు తిరుగుబాటు

ఆత్మ‌కూరు మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద మంత్రి ఆనం ముఖ్య అనుచ‌రుడు ఆందోళ‌న‌

ఆత్మ‌కూరు మున్సిపాలిటీ ప‌రిధిలోని వెంక‌ట్రావుప‌ల్లి రెండో వార్డులో ఓ స్థ‌లంలో ఉంద‌ని…ఎటువంటి అనుమ‌తులు లేకుండా…అక్ర‌మ ఇంటి నిర్మాణం మొద‌లు పెట్టార‌ని…దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడు చ‌ల్లా ర‌వికుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ క్ర‌మంలో మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద త‌న అనుచ‌రుల‌తో క‌లిసి…బైఠాయించి ఆందోళ‌న‌కు దిగారు.
ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్ర‌మంగా ఇంటి నిర్మాణం చేప‌డుతున్నార‌ని అధికారుల‌కి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. వెంట‌నే ఇంటి నిర్మాణం ఆపించి వేయాల‌ని మంత్రి అధికారుల్ని ఆదేశించినా… లెక్క చేయ‌క‌పోవ‌డం స‌రికాద‌న్నారు. త‌క్ష‌ణ‌మే అధికారులు జోక్యం చేసుకొని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై చ‌ల్లా నిర‌స‌న చేప‌ట్ట‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *