- తన భర్తపై విమర్శలుచేస్తే ఊరుకోను
- దండిగుంట గ్రామ సర్పంచ్ బెల్లంకొండ
నా కుటుంబం ఎలాంటిదో గ్రామ ప్రజలందరికి తెలుసునని…తన భర్తపై అనవసరంగా విమర్శలు చేస్తే ఊరుకోనని…దండిగుంట గ్రామ సర్పంచ్ బెల్లంకొండ సుప్రజ హెచ్చరించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో గ్రామ సర్పంచ్, తన భర్త శ్రీధర్లు మీడియాతో మాట్లాడారు. తన భర్తపై మండల టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ కుటుంబం ఎలాంటిదో గ్రామ ప్రజలందరికి తెలుసునని చెప్పారు. నా భర్తను టిడిపి నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డితో కలిసి మాట్లాడి నిధులు తీసుకువస్తే గ్రామాభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రామమ్మ, కాగోల్లు మస్తానయ్య ,శ్రీధర్ నాయుడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.