నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జున పురం గ్రామంలో ఆదివారం ఉదయం టిడిపి.. వైసిపి వర్గీయుల మధ్యఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన ఎస్ఎంసి ఎన్నికలలో విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నికైన పొన్నూరు మార్క్ పై స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ఈదురు యోహాను, ఈదురు ఏడుకొండలు, తాల్లూరు రాఘవులు,తాల్లూరు మణి, ఈదురు రాజా, కత్తి శీనయ్య ల తో దాడి చేయించారాని మార్క్ భార్య పొన్నూరు సంతోషమ్మ పేర్కొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దత్తత గ్రామం అయినటువంటి మల్లికార్జున పురం గ్రామంలోని గిరిజనులు అభివృద్ధి చెందాలని విద్యా కమిటీ ఛైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ దాడి విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అనంతరం N3 న్యూస్ తో మాట్లాడారు.