కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను నిరసించిన జోహార్ భారతి కళాశాల విద్యార్థులు
కోల్కత్తాలోని వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై కావలి పట్టణంలోని జవహర్ భారతి జూనియర్ కాలేజ్ , బి.ఎస్.సి నర్సింగ్, పారామెడికల్ విద్యార్థిని ,విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జవహార్ భారతి కాలేజ్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. బ్రిడ్జి సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. అనంతరం జవహర్ భారతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శామ్యూల్ రాజు, బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడారు. వారి వెంట కళాశాల సిబ్బంది ఉన్నారు.