- నెల్లూరులో ఇంత పెద్ద షోరూమ్ పెట్టడం గొప్ప విషయం
- వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
- నెల్లూరు మాగుంట లేఅవుట్లో శ్రీ సూర్య జ్యూయలర్స్ ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్,
నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని కింగ్స్ కోర్ట్ అవెన్యూలో…రవి కుమార్ గుర్రం, సూర్య గుర్రం, డాక్టర్ సుజితలు శ్రీ సూర్య జ్యూయలర్స్ గోల్డ్, సిల్వర్, డైమండ్స్ షోరూమ్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ముందుగా అతిధులకి షోరూమ్ అధినేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు జ్యూయలర్స్ ని ప్రారంభించి…జ్యోతి ప్రజ్వలన చేసి…ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి షోరూమ్ అంతా కలియ తిరిగి ఆభరణాలను వీక్షించారు.
అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. బంగారు వ్యాపారంలో గుర్రం సూర్యకి అపారమైన అనుభవం ఉందన్నారు. అదే విధంగా బెంగుళూరులో హోల్ సేల్ బిజినెస్ కూడా చేస్తుండేవారన్నారు. ఇప్పుడు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని చాలా విశాలమైన ప్రదేశంలో శ్రీ సూర్య జ్యూయలర్స్ ప్రారంభించారన్నారు. వీరి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని…ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ…నెల్లూరు నగరంలో శ్రీ సూర్య జ్యూయలర్స్ ఇంత పెద్ద షోరూమ్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు కుర్రాడు సూర్య…ఈ రంగంలో ఎంతో కష్టపడి ఇక్కడే పెద్ద షోరూమ్ని ఏర్పాటు చేసి…వందలాది మంది ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, నగరాధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.