రూ.15కే మూడు పూట‌లా క‌డుపు నిండా భోజ‌నం

  • టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి
  • 32వ డివిజ‌న్ డైక‌స్ రోడ్డులో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన గిరిధ‌ర్‌రెడ్డి

నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 32వ డివిజ‌న్ డైక‌స్ రోడ్డు సెంట‌ర్‌లో…అన్న క్యాంటీన్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ముందుగా డివిజ‌న్ లోని కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గిరిధ‌ర్‌రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయకులు ఈశ్వరయ్య, డివిజ‌న్‌ క్లస్టర్ ఇంచార్జీ మన్నెం పెంచల నాయుడుల‌తో క‌లిసి ఆయ‌న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. నిరుపేద‌లు, కూట‌మి నాయ‌కుల‌తో క‌లిసి గిరిధ‌ర్‌రెడ్డి అల్పాహారం చేశారు. టేస్ట్ ఎలా ఉంద‌ని నిరుపేద‌ల్ని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం గిరిధ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్ర‌భుత్వంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి నిరుపేద‌ల‌కి క‌డుపు నిండా నాణ్య‌మైన ఆహారం పెట్టింద‌న్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం నిరుపేదలను సైతం కక్షపూరిత ధోరణిలో అన్న క్యాంటీన్లను మూసివేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *