శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా కుంకుమార్చన
నెల్లూరు నగరం దర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో… శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. మహిళా భక్తులు విశేషంగా తరలి వచ్చి సామూహిక లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.