- రాష్ట్రమంటత ఒక పండుగ వాతావరణంలో ప్రారంభం
- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
- 38 డివిజన్లో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన వేములపాటి, ఎమ్మెల్యే కోటంరెడ్డి
పేదోడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు మళ్ళీ రాష్ట్రం అంతటా కూడా ఒక పండు వాతావరణం లో ప్రారంభం కావడం సంతోషకరమని… రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్ దగ్గర అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర
జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఇరువురికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు నిరుపేదలకి అల్పాహారం అందచేసి…టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… నెల్లూరు జిల్లా జనసేన పార్టీకే కాకుండా రాష్ట్ర జనసేనకు దశ దిశ నిర్దేశించే వ్యక్తి వేములపాటి అజయ్ కుమార్ అని తెలిపారు. అజయ్కుమార్ మాట్లాడుతూ… అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.