మండలంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
దుత్తలూరు మండలంలోని పలు కార్యాలయాలలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు వై నాగరాజు, ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ.. భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్ధులు దేశ భ క్తిని పెంపొందించుకోవాలని ఆయన తెలియజేసారు.
ఎరుకొల్లు పాఠశాల, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డి,జాతీయ జెండాను ఏగురవేశారు. ఆనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్వాతంత్ర సమరయోధుల త్యాగని వివరించి జాతీయగీతాన్ని ఆలపించి విద్యార్ధులందరికీ చాక్లెట్లు,స్వీట్స్ పంచిపెట్టారు.మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయలు, పాఠశాలలో మువ్వన్నెల జెండా రేపరేపలాడింది.