డ‌క్కిలిలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో రెప‌రెప‌లాడిన జాతీయ ప‌తాకం

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ స్థానిక పోలీసుస్టేష‌న్‌, మండ‌ల రెవెన్యూ కార్యాల‌యాల్లో మువ్వెన్న‌ల జెండా రెప రెప‌లాడింది. ఈ సంద‌ర్భంగా మండ‌ల రెవెన్యూ అధికారి ఎం. శ్రీ‌నివాసులు జాతీయ జెండాను ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం శ్రీ‌నివాసులు మాట్లాడుతూ… ఎంతోమంది సమరయోధుల ప్రాణ త్యాగమేనని తెలియ‌జేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ అమ‌ర వీరుల అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌న్నారు. డక్కిలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థినులతో పిరమిడ్స్ విన్యాసాలు ఏర్పాటు చేసి అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అధికారులు,సర్వేయ‌ర్లు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వీఆర్ఏలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *