పోషణ్‌ భీ .. పఢాయి భీ

వింజ‌మూరులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు మూడు రోజుల శిక్షణ తరగతులు పోషన్ బీ..పఢాయి బీ..!!వింజ‌మూరులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు మూడు రోజుల శిక్షణ తరగతులు. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. వింజమూరు జడ్పీ ఉన్నత బాలుర హైస్కూల్ ప్రాంగణంలో అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వ‌హిస్తున్నారు. సీడీపీఓ పద్మజ కుమారి ఆధ్వ‌ర్యంలో.. మూడురోజుల‌పాటు ఈ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ బీ పడాయి బీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఆరు…

Read More

50 మంది దంపతులకు వస్త్రాలు అందజేత

దాతృత్వం చాటుకున్న ప్రవాస భారతీయులు మధు కిరణ్ రెడ్డి 50 మంది దంపతులకు వస్త్రములు అందజేత. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతుల కుమారుడు మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 50 మంది దంపతులకు…

Read More

చెన్నై టూ నెల్లూరు

4 కేజీల బంగారం త‌ర‌లిస్తున్న నెల్లూరు యువ‌కులు వెంక‌టాచ‌లం టోల్ ప్లాజా వ‌ద్ద ప‌ట్టుకున్న విజిలెన్స్ అధికారులు బంగారం, కారుని సీజ్ చేసిన అధికారులు చెన్నై టూ నెల్లూరు…. విజ‌లెన్స్ ఎస్పీ రాజేంద్ర‌కుమార్ ఆదేశాల మేర‌కు… విజిలెన్స్ అధికారులు నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం టోల్ ప్లాజా వ‌ద్ద వాహ‌నాలు త‌నిఖీ చేప‌ట్టారు. చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా బంగారం త‌ర‌లిస్తున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో అధికారులు నిఘా పెట్టారు. సీఐ న‌ర‌సింహారావు, విష్ణురావులు త‌మ సిబ్బందితో టోల్ గేటు…

Read More

ఫైన్లు పెరిగాయి

ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల్సిందే ఫైన్లు పెరిగాయి… భార‌త‌దేశంలో రోజు రోజుకి రోడ్డు ప్ర‌మాదాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌మాదాల‌ నివార‌ణ కోసం ప్ర‌భుత్వం నిత్యం ఏదో ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ వాహ‌న చోద‌కుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావ‌డం లేద‌ని పోలీసు అధికారుల గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కాక ముందు వ‌ర‌కు ఒక నెల రోజుల‌పాటు రోడ్డు భ‌ద్ర‌త‌పై ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై విస్తృతంగా అవ‌గాహ‌న‌, ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్ప‌టికీ నేటికీ అధిక మొత్తంలో…

Read More

కూట‌మిలోనే అభివృద్ధి

నెల్లూరు రూరల్ 195 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు – టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నెల్లూరురూర‌ల్ 19,22,31,35 డివిజ‌న్ల‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు చేసిన కోటంరెడ్డి కూట‌మిలోనే అభివృద్ధి… కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామ‌ని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19, 22, 31, 35వ డివిజన్ లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయ‌న స్థానిక ప్రజలతో…

Read More

కావలి పాతవూరులో సంబరాలు

బీదాకు ఎమ్మెల్సీ పదవి పట్ల జనిగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు బీద రవిచంద్ర మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన మనోహర్. కావలి పాతవూరులో సంబరాలు… టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల కావలి పట్టణం పాతవూరులో సంబరాలు మిన్నంటాయి. టిడిపి యువ నాయకుడు జనిగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో పాతవూరు, బ్రిడ్జి సెంటరులో బాణా సంచా పేల్చి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు….

Read More

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే వాహ‌నాలు సీజ్‌

ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కి హెల్మెట్ త‌ప్ప‌ని స‌రి వాకాడు ఎస్ఐ నాగ‌బాబు నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే వాహ‌నాలు సీజ్‌… తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బ్యారేజ్ రోడ్ వద్ద ఎస్ఐ నాగ‌బాబు త‌న సిబ్బందితో క‌లిసి వాహ‌నాల త‌నిఖీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వాహ‌న‌దారుల‌కి ట్రాఫిక్ రూల్స్ తెలియ‌జేశారు. ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు త‌ప్ప‌ని స‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని సూచించారు. ముఖ్యంగా మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డ‌ప‌రాద‌న్నారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయా…

Read More

కావలిలో కూటమి శ్రేణులు సంబరాలు

కావలి బ్రిడ్జి సెంటరులో బాణా సంచ పేల్చి ఆనందోత్సవాలు బీద రవిచంద్రకు రెండో ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల హర్షం కావలిలో కూటమి శ్రేణులు సంబరాలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకు రెండో ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల కావలిలో టీడీపి, జనసేన, ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సెంటరులో బాణా సంచ పేల్చి సంతోషాన్ని పంచుకున్నారు. 16వ వార్డు జనసేన ఇన్చార్జ్ మల్లికార్జున యాదవ్ ఈ కార్యక్రమానికి కావలి జనసేన యువ నాయకుడు…

Read More

వాకాడులో గ‌డ్డివాము ద‌గ్ధం

ల‌బోదిబోమంటున్న పాడి రైతు వాకాడులో గ‌డ్డివాము ద‌గ్ధం… తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ఆభాక వారి వీధిలో నివాసం ఉంటున్న దువ్వూరు భాస్కరయ్య అనే పాడిరైతు గడ్డివాము అగ్నికి దగ్ధమైంది. వెంట‌నే బాధిత రైతులు అగ్నిమాప‌క శాఖ‌కు స‌మాచారం అందించ‌డంతో వారు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి మంట‌ల‌ను అదుపు చేశారు. అప్ప‌టికే 40వేల విలువ చేసే గ‌డ్డివాములు అగ్నికి ద‌గ్ధ‌మైపోయాయ‌ని రైతు భాస్క‌ర‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌డ్డి వాము…

Read More