ప్రభుత్వ నిధులు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయా లేదా..?

కోవూరులో త‌నిఖీలుచేసిన మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ విజయబారతి నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం.. కోవూరు మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల క‌మిష‌న్ స‌భ్యురాలు విజయభారతి ఆకస్మిక తనికీలు చేశారు. అక్క‌డి సిబ్బందితో మాట్లాడారు. కొన్ని ఫైల్స్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులు క‌ల్పించింద‌ని.. వీటిలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా .. లేదా.. గ్రామాలలో విద్యా, వైద్యం, విద్యుత్, పారిశుధ్యం పై పంచాయతీల పనితీరుతోపాటు పలు అంశాలపై…

Read More

అంత‌ర్రాష్ట దొంగ‌ల ఆట‌క‌ట్టించిన సీఐ బాబీ

ఇద్ద‌రు నింధితుల‌ను అదుపులోకి తీసుకున్న నాయుడుపేట సీఐ తిరుపతి జిల్లా నాయుడుపేట సీఐ బాబీ శ‌నివారం అంతర్రాష్ట్ర మోటార్ వెహికల్ దొంగల ఆట‌క‌ట్టించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో నిత్యం బైక్లను చోరీ చేస్తున్న ముఠా నుంచి తొమ్మిది బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బావి తెలిపారు. ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ చెప్పారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించామని, మరొకరు పరారీలో ఉన్నారన్న‌ట్లు తెలిపారు. వాహనదారులు త‌ప్ప‌నిస‌రిగా ప్రంట్ వీల్…

Read More

కృష్ణ‌ప‌ట్నం వ‌చ్చిన అంబాని

రిల‌య‌న్స్ భూముల‌ను ప‌రిశీలించిన రిల‌య‌న్స్ ఏడీఏ చైర్మ‌న్ అనీల్ అంబాని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండ‌లం కృష్ణ‌ప‌ట్నంలోని రిల‌య‌న్స్ భూముల‌ను రిల‌య‌న్స్ ఏడీఏ చైర్మ‌న్ అనీల్ అంబాని ప‌రిశీలించారు. నెల్లూరు జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్, ప‌లువురు అధికారుల‌తో క‌లిసి ఆయ‌న రిల‌య‌న్స్ భూముల‌ను సంద‌ర్శించారు. గ‌త కొద్ది రోజులుగా రిల‌య‌న్స్ భూముల‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో అంబానీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే దీనిపై పూర్తి వివ‌రాలు అధికారులు ప్ర‌క‌టించాల్సి ఉంది.

Read More

నెల్లూరులో దారుణం

న‌వాబ్‌పేట శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌లో ఘ‌ట‌న‌ సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించిన న‌గ‌ర డీఎస్పీ సింధుప్రియా నెల్లూరు న‌గ‌రంలోని న‌వాబ్‌పేట శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌లో మాబాషా అనే వ్య‌క్తి శ‌నివారం రాత్రి దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. షాహిద్ అనే వ్య‌క్తి మాబాషాపై క‌త్తితో దాడి చేసిన‌ట్లు స్థానికుల ద్వారా స‌మాచారం. ఈ విష‌యం తెలుసుకున్న న‌గ‌ర డీఎస్పీ సింధుప్రియా, సీఐ అన్వ‌ర్‌బాష సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. స్థానికంగా విచార‌ణ చేప‌ట్టారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు డీఎస్పీ సింధుప్రియ తెలిపారు.

Read More

నెల్లూరులో రూ. 6 కోట్లు ప్ర‌ద‌ర్శ‌న‌…

సిల్వ‌ర్ వోక్స్ స్కూల్లో…పురాత‌న‌, స‌మ‌కాలిన నాణేలు ప్ర‌ద‌ర్శ‌న‌ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభించిన క‌లెక్ట‌ర్ ఆనంద్‌ పురాత‌న నాణేల‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తోన్న విద్యార్థులు నెల్లూరు నగరంలోని సిల్వర్ వోక్స్ పాఠశాల యాజ‌మాన్యం….జాతీయ నాణేల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న నాణేల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్రమాన్ని ప్రారంభించారు. ముందుగా క‌లెక్ట‌ర్‌కు స్కూల్ యాజ‌మాన్యం, విద్యార్థులు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో సుమారు రూ….

Read More

మ‌ళ్లీ తెర‌పైకి జ‌య‌వ‌ర్ధ‌న్‌

మేయ‌ర్ పేషీ వేదిక‌గా కొత్త వివాదం త‌మ పేషీలోకి క‌మిష‌న‌ర్ సీసీ వెళ్లాడంటున్న మేయ‌ర్ దంప‌తులు విధి నిర్వ‌హ‌ణ‌లో మేయ‌ర్ భ‌ర్త ఆటంకం క‌లిగించాడంటూ జ‌య‌వ‌ర్ధ‌న్‌పై కేసు నెల్లూరు నగర కార్పొరేషన్ లో మ‌రో సారి మేయ‌ర్ స్ర‌వంతి భ‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్ వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ సారి క‌మిష‌న‌ర్ సీసీ వ‌ర్సెస్ మేయ‌ర్ దంప‌తులు కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మీడియాకు ఉన్న స‌మాచారం మేర‌కు…ప్రింట్ అవుట్ తీసుకునేందుకు మేయ‌ర్ పేషీలోకి క‌మిష‌న‌ర్ సీసీ వెళ్లాడ‌ని…అయితే…

Read More

అంతా ఓసీలకే పట్టు

నెల్లూరు జిల్లాలో ఏఎంసీ కమిటీ చైర్మన్ల ఎంపికకు రిజర్వేషన్ల తంటా రాష్ట్రంలో నెల్లూరు తప్పా అన్నీ జిల్లాల్లో కసరత్తు పూర్తి ఏఎంసీ రిజర్వేషన్ల కేటాయింపుకు నెల్లూరు జిల్లాలో సందిగ్ధం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతుంది. పార్టీ గెలుపుకు, తమ అభిమాన నేత విజయానికి శక్తి వంచన లేకుండా కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రాధాన్యం ఉన్న ఏఎంసీ పదవి కోసం నేతలు…

Read More

నైతిక విలువల‌కి -మోసానికి మ‌ధ్య పోటీ

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాం మైనార్టీ నేత క‌రీముల్లాకి అవ‌కాశం మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి నైతిక విలువలకి , మోసానికి మధ్య పోటీ జరుగుతుందని…మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీపై…ఆయ‌న నెల్లూరు జిల్లా పార్టీ కార్యాల‌యంలో…ఎమ్మెల్సీ, న‌గ‌ర నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ముందుగా డిప్యూటీ మేయ‌ర్‌గా 42వ…

Read More

అగ్రిగోల్డ్ సంపద దోపిడీ వెనుక ఎమ్మెల్యే హస్తం

వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ జామాయిల్ అక్రమ తరలింపు సంరక్షించని తహశీల్దారు, ఎస్సై, సీఐడీ పై కోర్టులో కేసులు సంచలన వ్యాఖ్యలు చేసిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య యదేచ్చగా అగ్రిగోల్డ్ సంపద దోపిడీ చేస్తుంటే అధికారులు చేతులుకట్టుకుని ఉన్నారంటే దీనివెనుక పెద్దశక్తి ఉందని, అది ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు మాకు బయట వినొస్తున్న మాటలనుచూస్తే అర్థం అవుతుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర…

Read More

యువత అభివృద్ధిపై అవగాహన సదస్సు

ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్ జాతీయ అధ్యక్షులు డేగ నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ యునైటెడ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు వేగూరు విజయకుమార్ యువతకు అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యువత చెడు మార్గాల్లో వెళ్లడం ద్వారా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. యువత బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. యువత భారతదేశానికి తొలి మెట్టు…

Read More