అసలేం జరిగింది…?

హత్యా…ఆత్మహత్య…? -యాపలగడ్డలో చెట్టుకి ఉరేసుకొని వ్యక్తి మృతి

అసలేం జరిగింది…?
-హత్యా…ఆత్మహత్య…?
-యాపలగడ్డలో చెట్టుకి ఉరేసుకొని వ్యక్తి మృతి

ఓ వ్యక్తి చెట్టుకి ఉరి వేసుకొని…ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన… భద్రాద్రి యాపలగడ్డ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు….యాపలగడ్డ గ్రామానికి చెందిన ధరావత్ రమేష్ దంపతుల మధ్య గత కొంత కాలంగా కుటుంబ విబేధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి పోయి తిరిగా రాలేదు. అయితే గత రాత్రి తన ఇంట్లో టీవీ చూస్తోన్న రమేష్ ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు తీసుకెళ్లి…ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుని తల్లి, పిల్లలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ది హత్య…లేక ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *