ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన పెద్దమ్మ చెరువు
అధికారుల నిర్లక్షమేనంటున్న ప్రజలు
చెరువా…డంపింగ్ యార్డ…?
- ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన పెద్దమ్మ చెరువు
-అధికారుల నిర్లక్షమేనంటున్న ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మ చెరువు డంపింగ్ యార్డ్ గా దర్శనమిస్తోంది. స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే వ్యవసాయానికి సాగునీరు అందే చెరువు ప్రస్తుతం డంపింగ్ యార్డ్ గా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెద్దమ్మ చెరువు ప్రాంతాన్ని అధికారులే దుర్వినియోగానికి చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులే…ఇలా వ్యవహరించడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మునుముందు పెద్దమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందో లేదో అన్న ప్రశ్నార్ధకంగా మారింది. కొంత కాలానికి అసలు రాజాపురంలో పెద్దమ్మ చెరువు ఉందా లేదా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి…చెరువుని శుభ్రం చేయించి…వ్యవసాయానికి సాగునీరు అందేలా చూడాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.