రాబోయే వర్షా కాలంలో ఇబ్బందులు లేకుండా తొలగింపు
సంగంలో డ్రైనేజీ పూడిక తొలగింపు…
రాబోయే వర్షా కాలంలో ఇబ్బందులు లేకుండా తొలగింపు
నెల్లూరు జిల్లా సంగం లో పంచాయతీ కార్యదర్శి నరసయ్య డ్రైనేజీ పూడిక తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు రహదారి పక్కనే పూడిపోయి ఉన్న డ్రైనేజీ ను పూడిక తీయించారు.గత కొద్ది రోజులుగా మురుగు నీరు రహదారి పైకి చేరి ప్రయాణికులు,పాదచారులు,నివాసాలలో ఉండే వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.దాంతో మంత్రి ఆనం ఆదేశాల మేరకు,స్థానిక సర్పంచ్ సహకారం తో పూడిక తీయిస్తున్నామని తెలిపారు.పూడిక తొలగింపు తో రాబోయే వర్షా కాలంలో ప్రజలు ఇబ్బందులు ఉండవని అన్నారు.రహదారి పై ప్రయాణించే ప్రయాణికులకు,పాదచారులకు ఇబ్బందులు తొలగుతాయని అన్నారు.