పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయింపు
ట్రస్ట్ అధ్యక్షులు రాకేష్ కి పత్రాలను అందచేసిన మంత్రి నారాయణ
రాష్ట్ర ప్రజలకి శుభవార్త…
- పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయింపు
-ట్రస్ట్ అధ్యక్షులు రాకేష్ కి పత్రాలను అందచేసిన మంత్రి నారాయణ
అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయించారు. సీఎం చంద్రబాబు హామీ ప్రకారం శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు సీఆర్డీఏ కేటాయించింది. ఈ మేరకు మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా… భూమి కేటాయింపు పత్రాలను అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డూండీ రాకేష్ అందుకున్నారు. 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. మార్చి 2026లోగా స్మృతి వనం ఏర్పాటు చేయాలని…. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు మంత్రి నారాయణ సూచించారు. ప్రభుత్వం భూమి కేటాయింపు చేయడం రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త అని డూండీ రాకేష్ తెలిపారు. భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా అమరజీవి స్మృతి వనం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.