తహసీల్దార్ పై ఆగ్రహించిన కాకర్ల_ _వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే_
పద్ధతులు మార్చుకోవాలి…
- తహసీల్దార్ పై ఆగ్రహించిన కాకర్ల
- వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
విధుల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరించారు. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నెల్లూరు జిల్లా వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అకస్మికంగా తనిఖీ చేశారు. రెవిన్యూ శాఖపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ హమీద్, విఆర్ఓలు, కొంతమంది కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుతున్న సేవల్లో అలసత్వం, నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే, కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యను గడువులోపే పరిష్కరించాలనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాసేవలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, వారి పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు, అర్జీదారులు పాల్గొన్నారు.