ఒక చిలుక ఏడాది తర్వాత వచ్చింది
వైసీపీ నాయకుల్ని హెచ్చరించిన టీడీపీ మహిళా నాయకురాళ్లు
నోరు కంట్రోల్లో పెట్టుకోండి…
- ఒక చిలుక ఏడాది తర్వాత వచ్చింది
- వైసీపీ నాయకుల్ని హెచ్చరించిన టీడీపీ మహిళా నాయకురాళ్లు
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో…తెలుగు మహిళా నాయకురాళ్లు భూలక్ష్మి, కుమారి విజయమ్మ, కప్పిర రేవతీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. VPR కుటుంబం అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే రాజకీయలలోకి వచ్చారని గుర్తు చేశారు. ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వ్యాఖ్యలపై రాష్ట్రం రగులుతోందన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతినెలా వైసీపీ నేతలు మాట్లాడుతుండడం దారుణమన్నారు. మరో సారి టీడీపీ మహిళా నాయకురాళ్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదని…వైసీపీ నాయకులు నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలని హెచ్చరించారు.