ఉదయగిరిలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ
మత్తు పదార్ధాలు వద్దు- జీవితమే ముద్దు
- ఉదయగిరిలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావ్ ఆధ్వర్యంలో… మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. స్థానిక జూనియర్ కాలేజీ నుండి బస్టాండ్ సెంటర్ వరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తుపదార్ధాలకు బానిస అవుతు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలు గురించి వివరించారు. ఉదయగిరి పరిసర ప్రాంతంలో ఎవరైనా డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాలేజీ విద్యార్థుల చేత డ్రగ్స్ వాడకం వలన జరిగే వినాశాన్ని తెలియజేస్తూ జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు,పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.