నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు వార్నింగ్ వెంకటగిరిలో ఆటో డ్రైవర్లకు రోడ్డు రవాణా భద్రతపై అవగాహన సదస్సు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో పట్టణంలోని ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్లకు రోడ్డు ప్రమాద నివారణ అంశాలపై వెంకటగిరి సీఐ ఏవి రమణ, ఎస్సై జి ఏడుకొండలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ ఏవి రమణ మాట్లాడుతూ… మద్యం సేవించి, అతివేగంతో, పరిమితికి మించిన ప్రయాణికులతో…

Read More

కొడవలూరులో నీటి సమస్యకు పరిష్కారం

ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు కొడవలూరులో నీటి సమస్యకు పరిష్కారం… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో కొడవలూరు మండలంలోని రెడ్డిపాలెం, మానేగుంటపాడులో ప్రజలకు నీటి సమస్య పరిష్కారం అయ్యింది. ఈ పంచాయతీల్లో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వెంటనే స్పందించిన ఆమె.. ఆయా గ్రామాల్లో కొత్త మోటార్లు ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దాంతో అధికారులు గ్రామానికి వెళ్లి బోర్లకు మరమ్మతులు చేయించారు. కొత్త…

Read More

అతిథి దేవోభవ

నెల్లూరు ప్రజలందరూ సహకరించాలి 30వ తేదీలోపు రొట్టెల పండుగ ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తాం బారాషహీద్ దర్గాలో ఏర్పాట్లను పరిశీలించిన అజీజ్, కోటంరెడ్డి అతిథి దేవోభవ… నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి లోటుపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని అధికారులను ఆదేశించారు. 30వ తేదీ లోపు ఏర్పాట్లు…

Read More

చిన్నారిపై దాడి అమానుషం

ఎమ్మెల్యే సోమిరెడ్డి – అపోలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్యే చిన్నారిపై దాడి అమానుషం ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారి చెంచమ్మపై వాతలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెంచమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సెల్ ఫోన్ విషయంలో గరిటె కాల్చి ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టడం దుర్మార్గమన్న సోమిరెడ్డి ఆగ్రహం…

Read More

కాళ‌హ‌స్తీశ్వ‌రా.. చూస్తున్నావా..?

పుణ్యక్షేతంలో..ఛీ..ఛీ.. ఇవేం పనులు ఆలయ ప్రాంగణంలోనే మద్యం సేవించడం, రాజ‌గోపురం వ‌ద్దే మూత్ర విసర్జన చేస్తోన్న సెక్యూరిటీ గార్డ్స్ ఈవో సార్‌.. ఓ లుక్కేయండి.. బుద్ధి చెప్పండి వాళ్ల‌కు కాళ‌హ‌స్తీశ్వ‌రా.. చూస్తున్నావా..? పుణ్యక్షేతంలో..ఛీ..ఛీ.. ఇవేం పనులు దక్షిణ కాశీ మహా పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీకాళహస్తి దేవస్థానంలో గ‌త కొంత కాలంగా అపశృతి దొర్లుతోంది. అక్క‌డ ప‌నిచేసే ఉన్న‌తాధికారి నుంచి.. కింది స్థాయి సిబ్బంది వ‌ర‌కు ఎంతో ప‌విత్రంగా.. భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో విధులు నిర్వ‌ర్తించాల్సి ఉంది. కానీ.. కొంద‌రు…

Read More

సీసీ కెమెరాలున్నాయ‌న్న విష‌యం మ‌ర‌చి దోపిడీకి య‌త్నం

ఓ కెమెరాను ప‌గ‌ల‌గొట్టినా.. మ‌రో సీసీ కెమెరా వాళ్ల‌ను చిత్రీక‌రించేసింది నెల్లూరు మండ‌పాల వీధిలో అర్థ‌రాత్రి దాటాక చోరీ య‌త్నం -ఎన్‌-3 ఎక్స్‌క్లూజివ్‌ భారీ దోపిడీకి య‌త్నించిన దొంగ‌లు..! -సీసీ కెమెరాలున్నాయ‌న్న విష‌యంమ‌ర‌చి దోపిడీకి య‌త్నం-ఓ కెమెరాను ప‌గ‌ల‌గొట్టినా.. మ‌రో సీసీ కెమెరా వాళ్ల‌ను చిత్రీక‌రించేసింది-నెల్లూరు మండ‌పాల వీధిలో అర్థ‌రాత్రి దాటాక చోరీ య‌త్నం ఎన్‌-3 ఎక్స్‌క్లూజివ్‌ అర్థ‌రాత్రి స‌మ‌యంలో.. ఎవ‌రూ లేనిది గ‌మ‌నించి.. త‌న‌ను మూడో క‌న్ను గ‌మ‌నిస్తుంటుంద‌నికూడా మ‌ర‌చిపోయి.. గోల్డ్ కొల్ల‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఓ…

Read More

వేనాడు దర్గాలో ఏఆర్ మోహమాన్ సోదరి

మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ఫాతిమా బేగం ఫామాతి బేగంతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డ భక్తులు వేనాడు దర్గాలో ఏఆర్ మోహమాన్ సోదరి తిరుపతి జిల్లా తడ మండలం వేనాడు గ్రామంలోని హజరత్ షేక్ దావూద్ షావలి దర్గా భక్తులతో కిటకిటలాడింది. కుల మతాలకతీతంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సోదరి ఫాతిమా బేగం పాల్గొని…

Read More

జ్యోతిష్యులు చెప్పారని

చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తారా చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ హెచ్చరిక నెల్లూరు జీజీహెచ్లోని వన్ స్టాఫ్ సెంటర్ తనిఖీ జ్యోతిష్యులు చెప్పారని… మూఢనమ్మకాలకు పోయి జ్యోతిష్యుల మాట విని పక్కింట్లోని సెల్ ఫోన్ ని చిన్నపాప దొంగిలించిందని అభూత కల్పనని సృష్టించి ఆ అమ్మాయిని చిత్రహింసలు గురి చేయడం దారుణమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ మండిపడ్డారు….

Read More

రైతులకి క్షమాపణలు చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ రైతులకి క్షమాపణలు చెప్పాలి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేసేవి విజయోత్సవాలు కాదని…స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట మభ్యపెడుతున్న ప్రలోభాలని విమర్శించారు. వారు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరిగా ఏ పథకం…

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జూలూరుపాడులో ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…మెడికల్ ఆఫీసర్ వెంకట్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ఆశావర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ వెంకట్ మాట్లాడుతూ… ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తించకుండా ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేతృత్వంలో సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆశా…

Read More