ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలి
బాధితుల నుంచి వినతులు స్వీకరించిన పోలీసు అధికారులు
పోలీసు గ్రీవెన్స్ కి 96 ఫిర్యాదులు…
- ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలి
- బాధితుల నుంచి వినతులు స్వీకరించిన పోలీసు అధికారులు
నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ డీఎస్పీ సింధుప్రియలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వారు వినతులు స్వీకరించారు. ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు…నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ వేదికలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్) CH.సౌజన్య , టౌన్ DSP సింధుప్రియ, మహిళా పోలీస్ స్టేషన్ DSP చెంచు రామారావులు పాల్గొని…బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి , SB-2 CI శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.