కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అర్జీలు స్వీకరించిన డీఆర్వో, డ్వామా పీడీ

కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక…

  • అర్జీలు స్వీకరించిన డీఆర్వో, డ్వామా పీడీ


నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డీఆర్వో ఉదయ భాస్కర్, డ్వామా పీడీ గంగా భవానీలు నిర్వహించారు. అర్జీదారుల నుంచి వారు వినతులు స్వీకరించారు.


నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి డీఆర్వో ఉదయ భాస్కర్, డ్వామా పీడీ గంగా భవాని, పలువురు అధికారులు వినతులు స్వీకరించారు. వేదికకు వచ్చే ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యంగా గ్రీవెన్స్ కి వినతులు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *