ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి

ఫీనిక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి పొంగూరు

గతంతో పోలిస్తే నెల్లూరులో వైద్య సేవలు మెరుగుపడ్డాయి

ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి

  • ఫీనిక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి పొంగూరు
  • గతంతో పోలిస్తే నెల్లూరులో వైద్య సేవలు మెరుగుపడ్డాయి


నెల్లూరు బృందావనం ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణలు ప్రారంభించారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.


నెల్లూరు ప్రజలకు ఉత్తమ సేవలందించేలా హాస్పిటల్ యాజమాన్యాలు కృషి చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని బృందావనం ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ని మంత్రి నారాయణతో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రారంభించారు. 50 పడకల హాస్పిటల్‌లో మెదడు, వెన్నెముక, నరాలు, చిన్న పిల్లలు, పురిటి పిల్లల విభాగాలకు సంబంధించి వైద్యం అందిస్తున్నారన్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ వైష్ణవి, నియోనేటాలజిస్ట్ డాక్టర్ గోకుల్‌ కృష్ణన్‌ను వారు అభినందించారు. వైష్ణవి తల్లిదండ్రులు డాక్టర్‌ పెంచలయ్య, నిర్మల గారు… జిల్లా స్థాయిలో మంచి వైద్య సేవలు అందించారన్నారు. గతంతో పోల్చితే నెల్లూరు జిల్లాలో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని, కొత్త ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చాయన్నారు. అత్యవసరమైన ట్రీట్‌మెంట్స్‌ను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *