వాహనాలను ప్రారంభించిన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఎస్పీ కృష్ణ కాంత్ కి తాళాలు అందచేత_
ఆత్మకూరుకి ఆరు పోలీసు వాహనాలు
- వాహనాలను ప్రారంభించిన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు
- ఎస్పీ కృష్ణ కాంత్ కి తాళాలు అందచేత
దివంగత నేత ఆనం వెంకటరెడ్డి జ్ఞాపకార్ధంగా..ఆత్మకూరు పోలీసు స్టేషన్ కి ఆరు పోలీసు వాహనాలను దాతలు అందచేశారు. వాహనాలను ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. వాహనాల తాళాలను ఎస్పీకి అందచేశారు.
ఆనం వెంకటరెడ్డి జ్ఞాపకార్ధంగా మంత్రి ఆనం ప్రత్యేక చొరవతో… దాతలు తాళ్లూరి గిరి నాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, వేలూరు కేశవ చౌదరి, మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, కొండ్రెడ్డి రితీష్ కుమార్ రెడ్డి, హర్షా రెడ్డి సమకూర్చిన ఆరు వాహనాలను ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పోలీస్ స్టేషన్లకు అందజేశారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ కు ఈ వాహనాల తాళాలను మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు అందజేసి జెండా ప్రారంభించారు. ఎంపీ, మంత్రులు, దాతలకి ఎస్పీ కృష్ణ కాంత్ ధన్యవాదాలు తెలియజేశారు.