యోగా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి..

జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ – ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా యోగాంధ్ర 2025

ప్రత్యేకతను చాటిన యోగాసనాలు

యోగా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి…

  • జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్
  • ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా యోగాంధ్ర 2025
  • ప్రత్యేకతను చాటిన యోగాసనాలు


నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ ప్రారంభించారు. కమిషనర్ నందన్, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, చిన్నారులతో కలసి ఇన్చార్జి కలెక్టర్ యోగాసనాలు వేశారు. యోగా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాల చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


మానసికంగా, శారీరకంగా అద్భుత ప్రయోజనాలు కలిగించే యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె కార్తీక్‌ పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన రెసిడెన్షియల్‌ థీమాటిక్‌ రాష్ట్రస్థాయి సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె కార్తీక్‌ హాజరై జ్యోతి ప్రజ్వలనతో యోగసనాలను ప్రారంభించారు. యోగా గురువు స్వప్న ఆధ్వర్యంలో చిన్నారులు సాధన్‌, దివ్య వేసిన యోగసనాలను అందరినీ ఔరా అనిపించాయి. ప్రతి ఆసనానికి తగినవిధంగా వీరు శరీరాకృతిని అవలీలగా మారుస్తూ వేసిన ఆసనాలు యోగా ప్రత్యేకతను చాటాయి. ఇన్‌చార్జి కలెక్టర్‌ కార్తీక్‌, కమిషనర్‌ నందన్‌, జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు, చిన్నారులు, వీరిని అనుసరించి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ కార్తీక్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నందన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ మాధురి, జిల్లా క్రీడాప్రాధికారసంస్థ అధికారి యతిరాజ్‌, జిల్లా ఆయూష్‌ అధికారి గోవిందయ్య, యోగాగురువులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *