పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు తిరిగి తీసుకురాలేము
వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలిచారు
కావలికి వచ్చి మధుసూదన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మంత్రి కందుల దుర్గేష్
పవన్ కళ్యాణ్ సాయం రూ.50 లక్షలు అందజేత
- పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు తిరిగి తీసుకురాలేము
- వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలిచారు
- కావలికి వచ్చి మధుసూదన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మంత్రి కందుల దుర్గేష్
మధుసూదన్ రావు ఉగ్రదాడిలో మృతి పట్ల స్పందించిన పవన్ కల్యాణ్ రూ. 50 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ఈ సాయాన్ని కావలికి వచ్చిన మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా నగదు చెక్కులను అందజేశారు.
పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ రావు కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలిచారని పర్యాటక, సినీ ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మధుసూదన్ రావు ఉగ్రదాడిలో మృతి పట్ల స్పందించిన పవన్ కల్యాణ్ రూ. 50 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ఈ సాయాన్ని శుక్రవారం కావలికి వచ్చిన మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ మధుసూదన్ ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కానీ జరిగిన సంఘటన పవన్ కళ్యాణ్ చలించారన్నారు. నిజమైన మానవతావాది, దేశభక్తి ఉన్న పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సహాయాన్ని అందించారన్నారు. ఈ సహాయం మధుసూదన్ పిల్లలు ఇద్దరు స్థిరపడేలా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ , కావలి జనసేన ఇంచార్జీ సుధాకర్ , జన సైనికులు పాల్గొన్నారు.